
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని తమ స్వగృహం నుండి పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మేళ తాళాల మధ్య బయలుదేరి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్ఫించారు. అనంతరం ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.