పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ని ఈ రోజు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేసారు. లక్డారం గ్రామంలో జరుగుతున్న సంతోష్ శాండ్ & గ్రానైట్ మైనింగ్ పేరుతో నాలుగు ఎకరాలకు అనుమతి తీసుకొని ఇష్టానుసారంగా 15 ఎకరాల్లో మైనింగ్ జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. గూడెం మధును అరెస్ట్ చేసిన అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గూడెం మధు అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే బి ఆర్ ఎస్ కార్యకర్తలు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు.
అనంతరం రంగంలోకి హరీష్ రావు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే ఇలా బెదిరిస్తున్నారు అంటూ హరీష్ రావు విలేకరులతో అన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. హరీష్ రావు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నా తమ్ముడిపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుతో కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *