ఇంద్రధనుస్సు ప్రతినిధి: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. భారత ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రాజీవ్ కుమార్ మరియు ఇద్దరు ఎలక్షన్ కమీషనర్లు గ్యాన్ కుమార్, సుఖబీర్ కుమార్ సందు తో కలిసి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి జూన్ ఆరవ తేది వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మొదటి విడత నోటిఫికేషన్ మార్చ్ 20 విడుదల అవుతుంది. తొలిదశ పోలింగ్ 19 ఏప్రిల్ తేదీన, రెండవ విడత 26 ఏప్రిల్, మూడవ విడత మే 7, నాల్గవ విడత మే 13, ఐదో విడత మే 20, ఆరో విడత మే 25, ఏదో విడత జూన్ 1 తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే విడతలో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 వ తేదీన ఉంటుంది. ఈ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.