హైదరాబాద్ నగరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైల్ వ్యవస్థలో మరో ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిన్న జరిగిన సమావేశంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ మార్గాల్లో మెట్రో రైల్ ను 69 వేల కోట్లతో విస్తరించడానికి ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మూడో దశలో 3250 కోట్లతో మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సంకల్పించారు. మెట్రో రైల్ విస్తరణతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది.