వందనపురి రామాలయంలో శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించిన అర్చకులు

శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్బంగా అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో శ్రీ అభయ కోదండ రామస్వామి వారి దేవాలయంలో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి హోమం ఈ రోజున నిర్వహించారు. ఈ హోమంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రామాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి హోమంలో ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిపి, తామరపూలతో మరియు పాయసంతో హోమం నిర్వహించారు. ఈ హోమం శ్రీమాన్ పెరవలి కేశవాచార్యులు గారి పర్యవేక్షణలో శ్రీ పెరవలి పృథ్వి సుదర్శన్ మరియు మరో ఇద్దరు ఋత్విక్కులు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *