రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరువు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నది. ఇప్పటికే నియోజక వర్గంలో దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపినట్లు తెలుస్తున్నది. ఆర్ధిక బలం, అంగ బలం గల స్థానిక నేత అయితేనే ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎదిరించి పోటీలో గెలవటానికి వీలుంటుంది. తెలంగాణ పిసిసి జరిపిన అభిప్రాయ సేకరణలో గాలి అనిల్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే గెలుపు తథ్యం అని భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం పటాన్ చెరువు నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశీస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓటమి చెందారు.