ఆపద సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరువు ఎమ్మెల్యే గౌ. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు తెలిపారు. పటాన్చెరువు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన రంగయ్య శెట్టి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే గారి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వారికీ మంజూరైన 90 వేల రూపాయల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు.