అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీ, ఎన్ఎంఆర్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మంగళవారం సాయంత్రం పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారులను బాగు చేయడంతో పాటు, నూతన రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.