పటాన్ చెరువు నియోజకవర్గంలో ఆగని దళిత బంధు నిరసనలు

పటాన్ చెరువు నియోజకవర్గంలోని జిన్నారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిన్నారం మండలంలో ఉన్న 955 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని మండల ప్రెసిడెంట్ వడ్డె క్రిష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ దిష్టిబొమ్మ కు పాడే కట్టి ఊరేగింపు చేసి దగ్ధం చేసిన పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. మండలంలో 955 కుటుంబాలు ఉంటే బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 152 కుటుంబాలకే దళిత బంధు ఇవ్వడం చాలా బాధాకరమని, దళితులందరికీ దళిత బంధు ఇచ్చేవరకు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ వడ్డె కృష్ణ, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఎంపీటీసీలు గోవర్ధన్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వీరారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజు గౌడ్, ట్రెజరర్ పట్నం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, క్రిష్ణ రెడ్డి, లక్ష్మణ్, బొల్లారం మున్సిపాలిటీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ క్రిష్ణ రెడ్డి, జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, పటాన్ చెరువు ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, జయశంకర్ గౌడ్, ఉప సర్పంచులు రమేష్, రవి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, పటాన్ చెరువు నియోజకవర్గ మండల ప్రెసిడెంట్స్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *