అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్సీ సబ్ సెంటర్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని సాయిరాం ఎంక్లేవ్, బీరంగూడ మంజీరా నగర్ కాలనీలలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం చక్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మణికంఠ హోమ్స్ లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మంచినీటి నల్ల కనెక్షన్లను ప్రారంభించారు. నూతన సబ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.