జయలక్ష్మి నగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్

అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని జయలక్ష్మి నగర్ ఐలమ్మ విగ్రహం నుండి రోడ్ నెంబర్ 8 వరకు 49.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపడిన సిసి రోడ్ నిర్మాణ పనులకు పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అనంతరం జయలక్ష్మి నగర్ ఫేస్ 4 లో స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చౌటకూరి బాల్ రెడ్డి, కౌన్సిలర్ మంజుల ప్రమోద్ రెడ్డి, కృష్ణ, బాలమణి బాలరాజ్, కవిత శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ యువ నాయకులు తుమ్మల రుశ్వంత్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు చౌటకూరి మైపాల్ రెడ్డి, శేఖర్, కాలప్ప, బి ఆర్ ఎస్ నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *