పటాన్ చెరు బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు మహా పాదయాత్ర

పటాన్ చెరు బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు అంబేద్కర్ విగ్రహం నుంచి బీరంగూడ శివాలయం దాకా మహా పాదయాత్ర కొనసాగించారు. వేలాదిమంది ప్రజలు మహా పాదయాత్రలో పాల్గొని నీలం మధుకు తమ సంఘీభావాన్ని తెలిపారు. పటాన్ చెరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ మహా పాదయాత్రను ప్రారంభించి ఎవరు ఏమనుకున్నా బిఆర్ఎస్ టికెట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకే కేటాయిస్తారని నీలం మధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి సబ్బండ బిసి వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు. మహా పాదయాత్ర బీరంగూడ గుట్ట శివాలయం వద్ద ముగించిన అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి మహా పాదయాత్రలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *