మీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగయ్య కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, కె ఎస్ ఆర్ కాలనీ, టైలర్స్ కాలనీలలో పర్యటించి కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకొని, జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ప్రతి మహిళకు 2500 ఇస్తామని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, రైతు కూలీలకు మరియు భూమి లేని రైతులకు సైతం రైతు భీమా పథకం, ప్రజల సంక్షేమం కోసం అందించే పథకాలను వివరించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మన్నె రవీందర్, ట్రెజరర్ సుధాకర్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, కౌన్సిలర్ మున్నా, జనరల్ సెక్రటరీలు రమేష్ యాదవ్, ఎండి సలీమ్, మహేష్, నాయకులు రవీందర్, చంద్రశేఖర్, ప్రకాష్, మురళి, విజయ్, సత్యనారాయణ, ఈశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భిక్షపతి, మల్లేష్, చుక్క రెడ్డి, బి శ్రీనివాస్, సతీష్, మల్లేష్, సిద్దు, దీపక్ గౌడ్, అనిల్ గౌడ్, సురేష్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.