మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్

పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గురువారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, నగేష్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసిన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్నినమోదు చేయనుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయిందని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల వలె పరిగెత్తుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *