పటాన్ చెరు ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రచార పర్వంలో ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం కోసం చాలా వాహనాలను సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు జరిపి వాటిని జెండా ఊపి ప్రారంభించారు పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.