సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రోడ్ షో లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దశాబ్ది కాలంలో బొల్లారంలో చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను వివరించారు. గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బొల్లారం పట్టణాన్ని అభివృద్ధికి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ రోడ్ షోలో బొల్లారం మున్సిపల్ చైర్మన్ కోలన్ రోజా బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.