తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఈ నెల 23న పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. 15 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు లక్ష మంది కార్యకర్తలతో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.