బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్నిపటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు మహాశివరాత్రి పండుగ రోజున దర్శించుకుని, ఆ పరమశివుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *