జవహర్ నగర్ కాలనీలో ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో 59 జీవో ప్రకారం 24 మంది నివాసులకు నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు అధికారులు పోలీసు సిబ్బందితో కాలనీకి వచ్చి డబ్బులు కట్టని వారి ఇల్లు కూల్చివేయాలని వచ్చిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు ఘటన స్థలానికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. గతంలో 2015లో జీవో 59 ప్రకారం బ్యాంకు డిడి ద్వారా అప్లికేషన్ ఫీజు కట్టినప్పటికీ మళ్ళీ ఇప్పుడు అధికారులు నోటీసులు ఇచ్చి జీవో 59 ప్రకారం 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కట్టాలని సామాన్య ప్రజలపై భారం మోపితే ఎలా కడతారు అని ప్రశ్నించింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అని ప్రశ్నించింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మహేష్, నాయకులు ప్రకాష్, సత్యనారాయణ, విజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *