కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుకలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.

తన పుట్టినరోజును హంగు ఆర్భాటాలకు దూరంగా నిరుపేదల సంక్షేమానికి అండగా నిలుస్తూ నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. మహిమా మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనాధ పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తల్లిదండ్రులను కోల్పోయి మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాధ పిల్లలను చేరదీసి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఆశ్రమంలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో భోజనం, యూనిఫామ్, ఉన్నత విద్యను అందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *