వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో ఇళ్ల మధ్యలోకి వరద నీరు చేరి కాలనీలు జలమయంగా మారాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ నందారం నరసింహా గౌడ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రసాద్ గారితో కలిసి కాలనీలను సందర్శించి, వరద నీరు వాగులోకి వెళ్లేలా చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.