తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి మరోసారి బి.ఆర్.ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు టికెట్ దక్కించుకున్నారు. అమీనుపూర్.కామ్ వారికీ అభినందనలు తెలుపుతున్నది.