ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ పర్యటనలో ఘనంగా స్వాగతం పలకటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ఏర్పాట్లు!!

మెదక్ లో 23-8-2023 తేదీన జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బహిరంగ సభ సందర్భంగా గుమ్మడిదల మండలం అన్నారం నుండి మంబాపూర్ వరకు సీఎం కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిన్నారం మండల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఊట్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇరవై వేల కార్యకర్తలతో స్వాగతం పలికిన అనంతరం, మెదక్ సభకు భారీ కాన్వాయ్ తో బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *