శివాలయం చౌరస్తా గణేష్ లడ్డు వేలం పాటలో 10 లక్షల 51 వేలకు లడ్డు దక్కించుకున్న గోపాల్ రెడ్డి

బీరంగూడ శివాలయం చౌరస్తాలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూ వేలం చాలా ఆసక్తికరంగా సాగింది. భక్తులు పోటీపడి వేలంపాటలో పాల్గొన్నారు. 26 కేజీల గణేష్ లడ్డు కోసం టీకేఆర్ గోపాల్ రెడ్డి అనే భక్తుడు 10 లక్షల 51 వేలకు వేలం పాట పాడి ఈ లడ్డును కైవసం చేసుకున్నారు. లడ్డుతోపాటు ఐదు వెండి నాణేలను కూడా గణేష్ ఉత్సవ కమిటీ వేలం వేయడం అందులో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రేటుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అలాగే గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కళాబృందాలు చేసిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులందరూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఆనందం పొందారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రామ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, గోపాల్ రెడ్డి, కృష్ణతోపాటు భారీగా భక్తి జనం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *