తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం వస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి ప్రకటన పట్ల హర్షం!!

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి పార్టీ ప్రకటించడం పట్ల అమీన్పూర్ మున్సిపాలిటీలోని BC కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు బిజెపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ అదెల్లి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు అనిల్ చారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని ప్రకటించిన అమిత్ షా గారికి మరియు బిజెపి జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ధన్యవాదాలు తీర్మానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు బిజెపి అభ్యర్థి టీ. నందీశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ 60 శాతం ఉన్న బీసీలకు కేవలం బిజెపి వల్లే న్యాయం జరుగుతుందని, కావున బీసీలు అందరూ బిజెపి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీని ముఖ్యమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొంతమంది యువకులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరి నందీశ్వర్ గౌడ్ గారి గెలుపులో భాగస్వాములమవుతామని మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *