కాంగ్రెస్ టికెట్ రేసులో అంతిమ విజయం సాధించిన కాటా శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ విషయంలో సంచలనాలు సృష్టించిన పటాన్ చెరు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు ఎట్టకేలకు ముగిసి కాటా శ్రీనివాస్ గౌడ్ కే అంతిమంగా టికెట్ దక్కింది. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కె.సి. వేణుగోపాల్ గారు పెండింగ్ నియోజకవర్గాలతో పాటు పటాన్ చెరు నియోజకవర్గం పరిస్థితులను సమీక్ష చేసి, పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ను అంతిమంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కే కేటాయించడంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడిపోయింది. కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ తమ నాల్గవ జాబితా విడుదల చేసింది. అందులో పటాన్ చెరు గురించి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా తెలియజేసింది. ఈ వార్త వెలువడిన వెంటనే పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ, అమీనుపూర్, శివాలయం చౌరస్తా ప్రాంతాల్లో కాటా అభిమానులు బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *