పటాన్ చెరులో జోరుగా నామినేషన్లు వేసిన ముఖ్య నేతలు

పటాన్ చెరు శాసనసభ నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 27 నామినేషన్లు రిటర్నింగ్ ఆఫీసర్ కు అందాయి. ఇందులో ముఖ్య నేతలు కూడా ఈ రోజు నామినేషన్స్ వేశారు. ఈ రోజు బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మరియు వారి సతీమణి యాదమ్మ గారు, బిజెపి తరపున టి. సంధ్య గారు, కాంగ్రెస్ పార్టీ తరపున కాటా శ్రీనివాస్ గౌడ్ గారి నామినేషన్ పత్రాలను వారి సతీమణి శ్రీమతి సుధా శ్రీనివాస్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమర్పించారు. నీలం మధు ముదిరాజ్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను తమ కుటుంబ సభ్యుల ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ కు పంపించారు. ఇప్పటికే బిజెపి అభ్యర్థి నందీశ్వర గౌడ్ నామినేషన్ వేసి యున్నారు. ఇక రేపు ఒక్కరోజు మాత్రమే నామినేషన్లు వేయటానికి గడువు ఉన్నది. బహుశా మిగతా నామినేషన్లు రేపు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులుగా చాలా మంది నామినేషన్లను సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *