అమీనుపూర్ సమ్మక్క సారక్క జాతరలో జోగిని శ్యామలతో పాటు పాల్గొన్న ఛైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సమ్మక్క సారక్క జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జోగిని శ్యామల నేతృత్వంలో బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ప్రతిసారి బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *