బీరంగూడ గుట్ట శివాలయం ఛైర్మన్ పదవి దక్కించుకున్న సుధాకర్ యాదవ్! ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక మండలి!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైస సుధాకర్ యాదవ్ మరియు పాలకమండలి సభ్యులుగా అరుణ నరేందర్ రెడ్డి, నిర్మల రమేష్ యాదవ్, గొల్ల మల్లేష్ యాదవ్, ఆశగారి లక్ష్మణ్, లక్ష్మీకాంతరావు, చంద్రశేఖర్, కుమ్మరి మహేష్, గోక మహిపాల్ రెడ్డి, దీపక్ గౌడ్, ఎల్వర్తి మల్లేష్ యాదవ్, బోయిని పెద్దులు, జనుముల శ్రీనివాస్, కుంచం ఎల్లయ్య చేత ఆలయ ముఖ్య కార్య నిర్వహణ అధికారి శశిధర్ గారి ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అమీన్పూర్ లోని శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని, ఈ బాధ్యతను ఎటువంటి అవినీతి అక్రమాలకు చోటివ్వకుండా సక్రమంగా నిర్వహిస్తామన్నారు, అదేవిధంగా రాబోయే మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సుధాకర్ యాదవ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త ఛైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయశాఖ మరియు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి, మరియు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు భారీ ఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *