ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు నియోజకవర్గం కిష్టారెడ్డిపేట్ గ్రామంలోని మైత్రి మిడోస్ కాలనీ వాసులు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని వారి నివాసంలో కలిసి తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వారికి విన్నవించారు. త్వరలోనే వారి సమస్యలను పరిష్కారమయ్యే విధంగా చూస్తానని కాటా శ్రీనివాస్ గౌడ్ గారు హామీ ఇచ్చారు.